జయశంకర్ భూపాలపల్లి : శ్రీ కాళేశ్వర ముక్వీశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటికిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చారు.
తెల్లవారుజామునుంచే భక్తులు త్రివేణి సంగమం గోదావరి తీరంలో స్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి, సైకత శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ఉసిరికా చెట్టు కింద దీపాలు వెలిగించారు.