హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress party) మోసానికి పెట్టింది పేరు అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari )అన్నారు. తప్పుడు హామీలతో( False promises) కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని ఆరోపించారు. అర్హులందరికి ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మోసాల పుట్ట అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజల తరఫున పోరాడుతామన్నారు.