KA Paul | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ఖాళీ చేతులతో హైదరాబాద్కు తిరిగి వచ్చాడని కేఏ పాల్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఇవాళే హైదరాబాద్కు వచ్చారు. పది రోజుల పాటు విదేశాల్లో తిరిగి ఇవాళ ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్తో పాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టాయా..? అమెరికాలో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి.. ఒక్క కంపెనీ అయినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందా..? అంటే లేదు.. కేవలం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో తిరిగొచ్చారు అని కేఏ పాల్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రులందర్నీ తీసుకుపోతానని గతంలో రేవంత్ రెడ్డికి చెప్పాను. ఇప్పటికే సీఎంలతో అనేక మీటింగ్లు పెట్టాను. అమెజాన్, టెస్లా సీఈవోలను కలుద్దామని చెప్పాను. వారం రోజుల్లో ఆస్టిన్, డల్లాస్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్తో పాటు మరిన్ని నగరాలకు వెళ్దామన్నాను. మాట కూడా ఇచ్చాను. జనవరి నుంచి ఇప్పటి వరకు నాతో రాలేదు. ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నాయకులను ఎవరు నమ్మరు అని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది అని కేఏ పాల్ అన్నారు.
రేవంత్ రెడ్డి నాతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించే వాడిని – కేఏ పాల్ pic.twitter.com/5yTNBCrk5d
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2024
ఇవి కూడా చదవండి..
Girl Molest | శంషాబాద్లో దారుణం.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన గిరిజన బాలికపై అత్యాచారం..