వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) పర్యటన కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జస్టిస్ ఎన్వీ రమణ.. శనివారం సాయంత్రం రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రాత్రి వరంగల్లోని నిట్లో బస చేశారు. ఆదివారం ఉదయం హనుమకొండలో నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.