రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో మరో అవినీతి ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డాడు. మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన బొంగోని అంజయ్యగౌడ్ తండ్రి 2005లో మరణించాడు. ఆయన పేరుపై ఉన్న స్థిరాస్తి మార్పిడి గురించి తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
ధ్రువీకరణ పత్రం కోసం జూనియర్ అసిస్టెంట్ రాజా కిషన్ను సంప్రదించగా తనకు వెయ్యి రూపాయలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రం అందజేస్తానని నెలరోజులుగా ఇబ్బందుల పాలు చేశాడు. దీంతో విసిగివేసారిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి వ్యూహం ప్రకారం బుధవారం తహసీల్ కార్యాలయంలో రూ. వెయ్యి అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీపీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్ ఆడిట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ ఆడిటర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.