మెదక్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్దశంకరంపేట్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. టీఆర్ఎస్లోనే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన