జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజేష్, గణేష్, మురళి, సతీష్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది, పాలకుర్తికి చెందిన కాషాబోయిన సాయి ముదిరాజ్ అధ్వర్యంలో జీడి రామకృష్ణ తదితరులు 10 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు, నర్సింగాపురం తండాకు చెందిన 30 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. సోమవారం తొర్రూరు మండలం, వెలికట్టె గ్రామ ప్రజా ప్రతినిధులు జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు దేవేందర్ రావు, సర్పంచ్ రాములు, బి. రవి, మాజీ సర్పంచులు దామోదర్ రావు, శ్రీనివాస్, నారాయణ, గ్రామ ప్రజలు తదితరులు మంత్రి ఎర్రబెల్లిని కలిసి పూర్తి మద్దతు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి గెలుపుకోసం కృషి చేస్తామని తెలిపారు.