కందుకూరు, అక్టోబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని సార్ల రావులపల్లి తండాకు చెందిన 50మంది వరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు గిరిజనులు మంత్రి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడప గడకు సంక్షేమ ఫలాలు అందుతున్నట్లు వివరించారు.
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించి హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి చిత్తుగా ఓడించాలని కోరారు. ఉద్యమ సమయంలో సీఎం కసీఆర్ గిరిజన తండాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న అనంతరం అధికారంలోకి వచ్చిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
500 జనాభా ఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాతీలు ఏర్పాటు చేసి వారి పాలనను వారు ఎలుకునే విధంగా చేసినట్లు చెప్పారు. గిరిజన తండాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. సర్పంచ్ రజిత ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి.మాజీ సర్పంచ్ గోవర్ధన్ నాయక్, బాలునాయక్, డైరెక్టరు దేవీలాల్ నాయక్, రైతు సమన్వయ అధ్యక్షుడు క్రిష్ణరాంభూపాల్రెడ్డి.కాకి దశరథ ముదిరాజ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్,పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.