చేవెళ్ల రూరల్, అక్టోబర్ 4 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షుడు ద్యారంగుల వెంకటేశ్, బీజేపీ బూత్ లెవెల్ అధ్యక్షుడు వరికుప్పల గణేశ్ దేవ్, బీజేపీ సీనియర్ నాయకులు ద్యారంగుల రామకృష్ణ, బీజేపీ నాయకులు అక్కెనపల్లి సునీల్, శ్రీకాంత్, గణపురం మహేశ్, మధు తదితరులు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వారికి మంత్రి సబితారెడ్డి బీఆర్ఎస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వెంటే యావత్ ప్రజానీకం ఉందని, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేసి విజయం సాధించా లన్నారు. మూడో సారి సీఎం కేసీఆర్కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు ద్యారంగుల విజయ, జైత్వారం ఎంపీటీసీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.