సూర్యాపేట : సూర్యాపేటలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సూర్యాపేట నియోజకవర్గంలో కారు దూకుడు మీదున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం ఊరూర, వాడ వాడలా కలియదిరుగుతున్నది. జనంతో మమేకమవుతూ ముందుకుసాగుతుండగా, అటు పదేండ్ల ప్రగతిని చూసి పార్టీలోకి వివిధ పార్టీల నుంచి వలసల వెల్లువ కొనసాగుతున్నది.
వివిధ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ.. కారుకే జైకొడుతుండగా, పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. తాజాగా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ కు చెందిన బీజేపీ నాయకులు లక్ష్మణ్, లింగ రాజు, ఎల్లయ్య, ఏడు కొండలు, సాయి కృష్ణ, మధుసూదన్తో పాటు గాంధీనగర్కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు బీఆర్ఎస్గత రాత్రి సూర్యాపేట లోని 43 వ వార్డ్ కు చెందిన భాజపా నాయకులు శేశగాని నరేష్ గౌడ్ తన 300 మాంది అనుచరులతో కలిసి భారసా లో చేరారు.