యాదగిరిగుట్ట/ భూదాన్ పోచంపల్లి/ శాలిగౌరారం/ దేవరకొండ/ కోదాడ/పెబ్బేరు/నందిపేట్, సెప్టెంబర్ 4: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండలంలోని వెల్మజాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గౌడ సంఘం అధ్యక్షుడు పంజాల గణేశ్తోపాటు 200 మంది కార్యకర్తలు, ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన వడ్డెర సంఘం అధ్యక్షుడు పల్లపు నర్సింహులు, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీరాముల కర్ణాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒర్సు నర్సింహులు ఆధ్వర్యంలో మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
హైదరాబాద్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో శాలిగౌరారం మండలంలోని ఉప్పలంచ గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాయి. దేవరకొండ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో డిండి మండలం నెమిలిపూర్ గ్రామానికి చెందిన పలువురు గులాబీ గూటికి చేరారు. కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సమక్షంలో మునగాల మండలంలోని వెంకటరామాపురం, సీతానగరం గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 100 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. వనపర్తి జిల్లా పెబ్బేరులో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, కౌన్సిలర్ గోపిబాబు ఆధ్వర్యంలో 5వ వార్డులోని వడ్డెర సంఘానికి చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని మారంపల్లిలో రజక సంఘం సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.