జనగామ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు పలువురు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఅర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నూతనంగా పార్టీలో చేరినవారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలి అని మంత్రి ఎర్రబెల్లి వారితో అన్నారు. పార్టీలో చేరిన వారిలో మునుగొండ యాదమ్మ, మునుగొండ మల్లయ్య, మునుగొండ గణేష్, మునిగొండ శ్రీనివాస్, గోకారపు యాకన్న, మునిగె జలంధర్, తిక్కుర్తి రాజు, ఇక్కుర్తి రాజు, పెరికే కోటేష్, మునిగొండ అశోక్, మునిగొండ మల్లయ్య, మునిగొండ అబ్బయ్య, బత్తిని గణేష్, గోకారపు భరత్, గోకారపు కళమ్మ, మునిగొండ శారద, మునిగె కళ్యాణి, బత్తిని ప్రమీల, మునిగొండ యాకమ్మ, పెరిక లలిత, జోగు యాదమ్మ ఉన్నారు.