జనగామ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం దేవునిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ధరావత్ తండా, బానోతు తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
అందరు కలిసి కట్టుగా బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేరిన వారిలో దరావత్ బిచ్చ, దరావత్ రాజు, భీమ, సునీత, బానోతు దస్రు, మంక్త, నందు, నర్సింహ, రమేష్, జమ్మ, భారతి, నీల, భిక్యా తదితరులు ఉన్నారు. అలాగే దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి యాదగిరి కూడా బీఆర్ఎస్లో చేరారు.