హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామం టూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేర కు శనివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. బడ్జెట్లో ఎడ్యుకేషన్కు కనీసం 8.2 శాతం కూడా కేటాయించలేదన్నారు.
అడ్డగుట్ట, జూన్ 13 : రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామనే ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విరమించుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తమది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వమని ఒట్టిమాటలు చెప్పుకునే కాంగ్రెస్ ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి చూపించాలని కోరారు.