చేవెళ్ల రూరల్, మార్చి 28 : కబ్జాలు కాంగ్రెసోళ్లు చేస్తరని, తాము చేయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. భూకబ్జా కేసులో విషయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యా రు. శంకర్పల్లి మండలం టంగుటూరు, చేవెళ్ల మండలం ఈర్లపల్లిలో భూవివాదానికి సంబంధించి జీవన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మోకిలా, చేవెళ్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగియగా… జడ్జి తీర్పు రిజర్వ్ చేశారు. జీవన్రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, పోలీసుల విచారణ ఆపాలని అప్పీల్ చేసుకున్నారు. దీన్ని హైకోర్టు తిరసరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అతన్ని అరెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలివ్వడంతో శుక్రవారం మోకిలా పీఎస్కు విచారణకు వచ్చారు. సుప్రీం ఇచ్చిన ఆర్డర్ను పోలీసులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని, కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకంటే ఎకువ మాట్లాడనని తెలిపారు.