ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
జంట వంతెనల వీధి నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో వాగు పరిసర ప్రాంతాలలో ఉన్న దుకాణాలు వరదనీటిలో మునిగిపోయాయి. నీటి ఉధృతి కొనసాగుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.