హైదరాబాద్, జనవరి 23 (నమ స్తే తెలంగాణ): రా ష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కనీసం ఒక్క బీసీనైనా ఎందుకు నియమించలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం ఆయన సచివాలయం లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. బీసీల అభ్యున్నతి కోసం చటబద్ధమైన పథకాలు అమలు చేయాలని, వృత్తి విద్యా కాలేజీలు, ఫైనాన్స్ కో-ఆపరేటివ్ బ్యాంకులతోపాటు 5 ఎకరా ల్లో పూలే దంపతుల సృ్మతివనాన్ని, పూ లే నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా బీసీని నియమించాలని, బీసీల కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.