నల్లగొండ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగం పనులు ముందుకు కదలక పోవడానికి నీటి ఊటనే కారణమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy )అన్నారు. హరీశ్ రావు నేతృత్వంలో ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన వద్దకు బయలుదేరే ముందు నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేది. నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారాచూశానన్నారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పాం.
నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రాజెక్టు పై అవగాహన లేక మంత్రులు పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ మంత్రి వాటర్లో నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమోడియన్ అయ్యాడు. గోడకు చెవులు పెట్టడం..సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.