నల్లగొండ: బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజల గోసకు కారణమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు పిల్ల మూకలు ఓ లెక్క కాదన్నారు. నల్లగొండలో పార్టీ నాయకులు కోటిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్తో కాలిసి బీఆర్పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. ప్రజలు పాధి కోసం మళ్లీ విదేశాల బాట పట్టాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్లో పచ్చని పంటలతో కలకలలాడే భూములు బీడుగా మారాయని విమర్శించారు. పదేండ్లు అద్భుతంగా నిర్మించిన తెలంగాణను మూడు నెలల్లోనే కుప్పకూల్చారని ఆగ్రమం వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ జీవితంలో నిజాలు మాట్లాడలేదని ఫైర్అయ్యారు.