కన్నడ సీనియర్ నటి ప్రతిమా దేవి(88) వయో సంబంధిత సమస్యలతో మంగళవారం బెంగళూరులో కన్నుమూశారు. కన్నడంలో వంద రోజులు ఆడిన తొలి సినిమా ‘జగన్మోహిని’లో ప్రతిమాదేవి కథానాయికగా నటించింది. కృష్ణలీల, చంచల ఉమారి, శివశరణే నామియక్క, మంగళ సూత్రతో అరవైకిపైగా కన్నడ సినిమాల్లో ప్రతిమాదేవి నటించింది. నిర్మాత శంకర్సింగ్ను పెళ్లాడారు ప్రతిమాదేవి. వారి సంతానంలో రాజేంద్రసింగ్బాబు, విజయలక్ష్మీ సింగ్ దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు. కన్నడ చిత్రసీమ గొప్ప నటిని కోల్పోయిందని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంతాపాన్ని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు