కమర్షియల్ హంగులకు సార్వజనీన అంశాలను జోడిస్తూ సినిమాలు చేయడానికే తాను ఇష్టపడతానని అంటున్నారు నిర్మాత దిల్రాజు. శిరీష్తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వకీల్సాబ్’. పవన్కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో దిల్రాజు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
పవన్కల్యాణ్ నటించిన‘తొలిప్రేమ’ చిత్రానికి పంపిణీదారుడిగా వ్యవహరించా. ఆ సమయంలో పవన్కు యువతరంలో ఉన్న ఫాలోయింగ్, నటుడిగా ప్రతి సినిమాలో ఆయన చూపుతున్న పరిణితి నన్ను ఆకట్టుకున్నాయి. నిర్మాతగా మారితే పవన్కల్యాణ్తో తప్పకుండా సినిమా చేయాలనుకున్నా. 22 ఏండ్లుగా నేను కన్న కల ఈ సినిమాతో వాస్తవరూపం దాల్చడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో సినిమాల పట్ల నాకున్న తపన, ఇష్టాన్ని పవన్కల్యాణ్ స్వయంగా గ్రహించారు. అందుకే ఈ అనుబంధాన్ని ఒక్క సినిమాతోనే ముగించకుండా భవిష్యత్తులో నాతో మరిన్ని సినిమాలు చేస్తానన్నారు. నిర్మాతగా ఈ సినిమా ప్రయాణం సంతృప్తినిచ్చింది. సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్పే మాటల్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మ్యాజిక్ జరగబోతుందనిపిస్తోంది.
‘పింక్’ రీమేక్లో పవన్కల్యాణ్ నటిస్తున్నారని తెలియగానే రీఎంట్రీ కోసం ఇలాంటి చిత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారని విమర్శలొచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మూలకథలోని ఆత్మ చెడిపోకుండా పవన్ కల్యాణ్ ఇమేజ్, హీరోయిజాన్ని జోడిసూ భావోద్వేగాలు పక్కదారి పట్టకుండా సినిమా చేయడం కత్తిమీదసాములా అనిపించింది. పవన్ అభిమానులను సంతృప్తిపరిచేలా ఓ ఫార్ములా సిద్ధంచేసుకొని దర్శకుడు శ్రీరామ్వేణు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ విషయంలో దర్శకుడు చాలా కష్టపడ్డారు. వందశాతం అతడు ఈ సినిమాకు న్యాయం చేశాడు. నా ఊహలకు మించి అద్భుతంగా సినిమా తెరకెక్కించాడు. లాయర్ పాత్రలో పవన్కల్యాణ్ నటించిన తొలి సినిమా ఇది. తన ైస్టెల్, బాడీలాంగ్వేజ్ను అంతర్లీనంగా చూపిస్తూ లాయర్ పాత్రను వినూత్నంగా దర్శకుడు ఆవిష్కరించారు. పవన్ సినిమాకు ఇలాంటి సామాజిక ఇతివృత్తమున్న కథ దొరకడం బోనస్గా భావిస్తున్నా. సామాజిక అంశాలు, కథాబలం మిళితమై చక్కటి సోల్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరచలేదు. ఈ సినిమా విషయంలో నా జడ్జిమెంట్ ఫెయిలవ్వదనుకుంటున్నా.
తెలుగులో స్టార్ సినిమా విడుదలై పదిహేను నెలలు దాటిపోయింది. అగ్ర కథానాయకుల సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా భయాలు అధిగమిస్తూ సినిమా తాలూకు వినోదాన్ని ఆస్వాదించాలంటే స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మినహా వేరే మార్గంలేదు. తెలుగు రాష్ర్టాల్లో యాభై శాతం ఆక్యుపెన్సీ నిబంధనను ప్రభుత్వాలు ఇప్పట్లో అమలు చేయవని అనుకుంటున్నా. సినీ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. రామ్చరణ్, శంకర్ కలయికలో రానున్న సినిమా జూలై, ఆగస్టులో మొదలుకాబోతున్నది. మా సంస్థలో రూపొందుతున్న ఎఫ్-3, థాంక్యూ, రౌడీబాయ్స్, పాగల్ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. బాలీవుడ్లో మూడు సినిమాలు నిర్మిస్తున్నా.
ఇవి కూడా చదవండి..
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు