అబిడ్స్, ఫిబ్రవరి 12: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్టు ఐటీశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అద్యక్షుడు డీ శ్రీధర్బాబు ప్రకటించారు.
సోమవారం రాత్రి ఎగ్జిబిషన్ మైదానంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, స్టాల్ హోల్డర్లకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి బహుమతులను ప్రదానం చేశారు. స్టాల్ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు 18 వరకు నుమాయిష్ కొనసాతుందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. నుమాయిష్ ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తున్నదని మంత్రి జూపల్లి తెలిపారు.