ధర్మారం, సెప్టెంబర్ 9: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మోదీ పాలనలో భ్రష్టు పట్టిన దేశాన్ని బాగు చేయడం కేసీఆర్తోనే సాధ్యమని అన్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ‘స్వచ్ఛ గురుకుల డ్రైవ్’ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయడం కేసీఆర్తోనే సాధ్యమని తెలిపారు.