హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొంటూనే.. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. రెవెన్యూ ఉద్యోగులంతా ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సోమవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ను కలిశారు. సీఎం సహాయనిధికి ఒకరోజు వేతనాన్ని జమ చేయడానికి అంగీకార పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కే నిరంజన్, రమేశ్ పాక, కార్యదర్శి చిల్లా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నజీమ్ఖాన్, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కే రామకృష్ణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.