Get together | యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన గెట్ టుగెదర్ పార్టీ విషాదంతమైంది. ఫామ్హౌస్లో స్నేహితులంతా కలిసి నిర్వహించిన వేడుకలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు ఫామ్హౌస్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కలిసి కొయ్యలగూడెం శివారు ఫామ్హౌస్లో గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము (27) అనే యువకుడు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతను అనుమానాస్పదంగా మృతిచెందాడు.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్టీకి హాజరైన మిగతా స్నేహితులందర్నీ పోలీసులు విచారిస్తున్నారు.