హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో కన్నడనాట కటిక చీకట్లు అలుముకొన్నాయి. బీజేపీని ఓడించి కాంగ్రెస్ను గెలిపించి.. తాము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారు. ఐదు గ్యారెంటీ సీమ్లను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగులకు ఆ పార్టీ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నది. రైతులకైతే పట్టుమని ఐదు గంటల కరెంట్ కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ఐదు గ్యారెంటీ పథకాలను అమలుచేసేందుకు అప్పటికే ఉన్న పథకాలకు మంగళం పాడిందని, కొత్త గ్యారెంటీలనూ అట కెకించిందని, రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ సరఫరాల లేక చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయని కన్నడిగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు కోతలతో బెంగళూరులో ఐటీ కంపెనీలు సతమతమవుతున్నాయని, వివిధ రకాల పరిశ్రమలు పరిశ్రమలు సిబ్బందిని తొలగిస్తున్నాయని చెప్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అనధికార కోతలు ఆరేడు గంటలపాటు ఉన్నాయి. అక్టోబర్లో ఉష్టోగ్రతలు పెరగడంతో 1,500 మెగావాట్ల నుంచి 2,000 మెగావాట్ల వరకు లోటు విద్యుత్తుతో సతమతం అవుతున్నదని, కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్తు లోటు నమోదైందని విద్యుత్తు అధికారులు సైతం తెలిపారు. అయితే పకనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు కరెంటు బుగ్గలు వెలుగుతుంటే తమ రాష్ట్రంలో నాలుగు గంటలు కూడా గగనమైతున్నదని కన్నడ ప్రజలు, రైతులు వాపోతున్నారు. కోతలు లేకుండా, తమకు నాణ్యమైన విద్యుత్తు అందించాలంటూ చాలాచోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
మూడు లక్షల అప్పు చేసి పంటలు సాగు చేస్తున్న. వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇస్తమన్నరు. ఇప్పుడు అది ఐదు గంటలు చేసిన్రు. అది కూడా సక్కగ ఇస్తలేదు. పంటలు ఎండిపోతున్నయ్. ఉరిపోసుకుని చావాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటాడుకుంటున్నది. విద్యుత్తు కోతలతో రైతులను ఆగం జేస్తున్నది. పక్కన తెలంగాణల 24 గంటల కరెంటిస్తున్నరు. వేరే దగ్గర కరెంట్ను కొని ఆయినా సరే 10 గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా చేయాలి.
– చంద్రప్ప, హన్పూర్ గ్రామం పంచాయతీ మెంబర్
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కష్టాలు అధికమయ్యాయి. వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గంటలకొద్దీ ఎడాపెడా కోతలు విధిస్తున్నది. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇది తట్టుకోలేని రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గడిచిన 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,219 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– లక్ష్మారెడ్డి, హన్పూర్ గ్రామం, మాజీ జడ్పీవైస్చైర్మన్ గుల్బర్గ
నాలుగెకరాల్లో వరి వేసిన. కాంగ్రెస్ నాయకులు 7 గంటల కరెంటు ఇస్తమన్నరు. ఇప్పుడు 5 గంటలు కూడా ఇస్తలేరు. అదికూడా సక్కగ ఇస్తలేరు. అన్ని కోతలు. 2 ఎకరాలు పారుతుం ది, 2 ఎకరాలు ఎండుతుంది. 5 నెలల్లోనే కాంగ్రెస్ చుక్కలు చూపిస్తున్నది. 4 ఎకరాల సాగు కోసం 2 లక్షల అప్పు చేసినం. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ నేతలు దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎవుసం చేయలేని పరిస్థితి దాపురించింది.
– లక్ష్మీకాంత్రెడ్డి, హన్పూర్ గ్రామం
కర్ణాటకలో ప్రతి పేదవాడికి 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఉచిత విద్యుత్తు దేవుడెరుగు, అసలు కరెంటుకే దికు లేకుండా పోయింది. పాత స్కీములు ఆపిన్రు. కొత్తవి అమలు చేస్తలేరు. 7 గంటల కరెంటు ఇస్తమన్నరు.. 5 గంట లు కూడా కోతలు లేకుండా ఇస్తలేరు. పొద్దున సగం, రాత్రి సగం ఇస్తున్నరు. ప్రజల విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేసింది.
– రాజు, మస్లే గ్రామం, కర్ణాటక
కర్ణాటకల రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఏడు గంటలపాటు కరెంటు ఇడుస్తుండె. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఐదు గంటలే ఇడుస్తున్నరు. అది కూడా పొద్దున రెండు గంటలు. రాత్రి 3 గంటలు ఇస్తున్నరు. అదేమైనా సక్కగ ఇస్తర అంటే లేదు. లోడు పడుతున్నదని చెప్పి కోతలు పెట్టుకుంట ఇస్తున్నరు. మోటర్లు కాలుతున్నయ్. ఐదు గంటలు ఇచ్చినా ఎకరం కూడా పారుతలేదు. పంటలు ఎడిపోతున్నయ్.
– ముకరాన, మలబార్ గ్రామం