హైదరాబాద్, ఫిబ్రవరి 1,(నమస్తే తెలంగాణ): మేకిన్ ఇండియాగా కేంద్రం గొప్పగా చెప్పుకొనే పథకం ఇప్పుడు మూలకుపడినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మల ఈ పథకాన్ని మొక్కుబడిగానే ప్రస్తావించారు.
దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకు మించి మేకిన్ ఇండియాకు సంబంధించి గొప్ప ప్రకటనలు చేయలేదు. దీంతో మేకిన్ ఇండియా మూలకుపడ్డట్టేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.