హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో కాలువలు తవ్వి, సాగునీరు అందించేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
త్వరలో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్జీవన్ పాటిల్తో ప్రాజెక్టుల సీఈలు, ప్యాకేజీల వారీగా పలు అంశాలపై చర్చించారు.