హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని, తప్పుచేసిన వారిని శిక్షస్తామని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించారని విమర్శించారు.
అన్నారం, సుందిళ్లకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయని, నాసిరకం నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కేజీ మాత్రమే అదనంగా ఇస్తున్నదని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖపై అప్పులు రూ. 3,360 కోట్ల నుంచి రూ. 56వేల కోట్లకు పెరిగాయని తెలిపారు.