నాగర్ కర్నూల్ : విద్యుత్ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్ నోటీసులు( Show cause notices) జారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఇంత పెద్ద సంఖ్యలో అధికారులకు షోకాజ్ నోటీసులు అందించడం ఇదే ప్రథమంగా భావిస్తున్నారు.
నాగర్ కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో నెలకు రూ. 9.32 లక్షలు తేడా రావడాన్ని విజిలెన్స్ అధికారులు(Vigilence Officers) గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్పీడీసీఎల్(SPDCL) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 9 మంది ఏఈఈ(AEE)లు, నలుగురు ఏడీఈ(ADE)లు, ఒక డీఈ(DE)కి నోటీసులు అందజేశారు.
గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో విద్యుత్ మీటర్లు లేకుండా వాడుతున్న కరెంట్ వల్ల తేడా వచ్చినట్లు సూపరింటెండెంట్ ఇంజినీర్ లీలావతి వెల్లడించారు. మీటర్లు లేని చోట్ల తాజాగా మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.