కామారెడ్డి: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని (International Yoga Day) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలోని 500 ఏండ్ల కాలంనాటి చారిత్రక నాగన్న మెట్లబావిలో కేజీబీవీ (KGBV) విద్యార్థులు యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన యోగా దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు న్యాయవాదులు, ప్రజాప్రనిథులు పాల్గొన్నారు.