హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచే ఉద్భవించిన మరో మానస పుత్రిక హరితహార కార్యక్రమమని అన్నారు.
హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించు కోగా, లక్ష్యాన్ని అధిగమించి 239 కోట్ల మొక్కలు నాటమని తెలిపారు. హరితహార కార్యక్రమానికి ఇప్పటివరకు రూ. 6555.97 కోట్లు వెచ్చించామన్నారు. హరితహార కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రమంతా 3.67 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు.
ఇదే ప్రణాళికతో ముందుకుసాగుతూ.. 33% శాతం అటవీకరణ సాధిస్తామని తెలిపారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజలు, విద్యార్థుల్లో హరితహార కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అడవుల పరిరక్షణకు అటవీ అధికారులు కృషి చేస్తున్నారని విరించారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి హరితహార భావజాల వ్యాప్తికి తనవంతు కృషి చేస్తున్నారని అభినందించారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
గోదావరిలో కొట్టుకుపోయిన యువకుడు..కాపాడిన మత్స్యకారులు