Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 926 పరీక్ష కేంద్రాల్లో 4,27,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు సెట్ బీ ఎంపిక చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి.