హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో శుక్రవారం భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అ సెంబ్లీ ఆవరణలో అంబేదర్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం పోరాడి సాధించామని గుర్తుచేశారు. బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంసర్త ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అన్నా రు. దీనిపై ఇప్పటికే స్పీకర్కు వినతిపత్రం అం దించామని, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగడుతున్నామని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామని, ఆ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తామని, అందులో తొలి అడుగు గా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నామని వివరించారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నా నిర్వహిస్తామని, ఆ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10-15 పోస్టు కార్డులు పంపించడం వంటి సూచనలు వచ్చాయని, వాటిపై కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఏప్రిల్ 11లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేస్తామని వివరించారు.
భారత జాగృతి ఆధ్వర్యంలో రమణ అధ్యక్షతన కొనసాగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు కవితకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పద్మశాలి సంఘం నాయకుడు శివశంకర్, ప్రొఫెసర్ తాటికొండ రాజయ్య, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్, సంచార జాతుల సంఘం ప్రొఫెసర్ కోలా శ్రీనివాస్, సీపీఐ నేత బాలమల్లేశ్, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఓబీసీ కులగణన జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్యాదవ్, తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం నేత రాచమల్ల బాలకృష్ణ, వడ్డెర సంఘం నాయకులు మురళి, సీపీఐ(ఎంఎల్) నాయకుడు సుభాష్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బండారి శేఖర్, బీఎస్పీ నాయకురాలు అనితారెడ్డి, ఓబీసీ అధ్యయన కన్వీనర్ ఎర్రోజు శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘాల చైర్మన్ ఏల్చల దత్తాత్రేయ, రజక సంఘం అధ్యక్షుడు భిక్షపతి, సీపీఐ ఎంఎల్ రెడ్ ఫ్లాగ్ నాయకుడు రాజేశ్, బీసీ సంఘం నాయకులు ఓరుగంటి వెంకటేశ్, బాలమణి, మున్నూరు కాపు సంఘం నాయకుడు మహేందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, గంగపుత్ర సంఘం అధ్యక్షురాలు రేణుక, గౌడ సంఘం ఉపాధ్యక్షురాలు కీర్తి లతాగౌడ్, టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు, అఖిల భారత సగర మహా సంఘం అధ్యక్షుడు విజయేంద్ర సాగర్, నాయీబ్రాహ్మణ సంఘం నేత దేవరకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశం 9 తీర్మానాలను ఆమోదించింది. ఫూలే విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఏప్రిల్ 11లోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి, ఫూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి, ఫూలే దంపతుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి, బీసీ సంక్షేమశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, ఓబీసీ జనగణన చేపట్టాలి, మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఏర్పాటు చేయాలి, కులగణన చేసి 42 శాతం రిజ్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించింది.
బీసీలు, దళితులకే కాకుండా అన్నివర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని బీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ కొనియాడారు. ఆ మహనీయుని విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తే భావితరాలకు స్పూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. పూలే విగ్రహ సాధన ఉద్యమం బీసీల ఐక్యతకు పునాది కావాలని ఆకాంక్షించారు. భారత జాగృతి చేస్తున్న ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని, అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఎజెండాలు పకనబెట్టి విగ్రహం సాధనకు పనిచేయాలని బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచందర్రావు పిలుపునిచ్చారు.
వివక్ష లేని సమాజాన్ని బీఆర్ఎస్ కోరుకుందని, కేసీఆర్ నేతృత్వంలో పదేళ్ల పాలనే నిదర్శనమని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఆంజనేయగౌడ్ కొనియాడారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 50 శాతం బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, అదే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతీ విశ్వవిద్యాలయాల్లో పూలే పేరిట ఓబీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.