కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో (Palwancha) కుటుంబం ఆత్మహత్య ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడి కొత్తగూడెం దవాఖానలో చికిత్స పొందుతూ చిన్నారి సాహితీ మృతి చెందింది. దీంతో నాగరామకృష్ణ కుటుంబంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఆర్థిక ఇబ్బందులతో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యా పిల్లలకు నిప్పంటించిన రామకృష్ణ.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దంపతులు సహా పెద్ద కుమార్తె సాహిత్య సజీవదహనమయ్యారు. మరో కూతురు సాహితి తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించారు. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న సాహితి.. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందింది.