హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటర్లకు ఎడమచేతి మధ్యవేలిపై ఇంకు గుర్తు పెట్టనున్నారు. ఇటీవల జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటువేసినవారికి ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకుగుర్తు వేశారు. సాగర్ నియోజకవర్గం దీనిపరిధిలోనే ఉండటం, ఇంకా ఇంకు చెరగిపోకపోవడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించింది. ఈనేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీచేశారు.
సాగర్ ఉపఎన్నికల ప్రచారం నేడు ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడుతుంది. ఎన్నికలు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడుతాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..