నిజామాబాద్, జూన్ 22 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 4,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. బుధవారం సాయంత్రానికి మరింత ఇన్ఫ్లో వచ్చి చేరే అవకాశముందని ఏఈఈ చెప్పారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగుల (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1065.40 అడుగుల (20.895 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ వివరించారు. ఈనెల 13వ తేదీ నుంచి రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతుందన్నారు.
10 రోజుల వ్యవధిలో ఒక టీఎంసీకి పైగా వర్షపు నీరు వచ్చి చేరిందన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1067.8 అడుగుల (24.954 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.