నల్లగొండ : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి(Infant dies) చెందడంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు దవాఖానపై దాడి చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలోని( Devarakonda )ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాకు చెందిన ముడావత్ నందిని మంగళవారం రాత్రి ప్రసవం కోసం దేవరకొండ ప్రభుత్వ దవాఖనలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించాడు. అయితే చిన్నారి ఆరోగ్యం బాగా లేదని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
శిశువును హైదరాబాద్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్పై దాడికి పాల్పడి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.
దాడిలో ధ్వంసమైన ఫర్నీచర్..