రామగిరి, జూలై 17 : డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ‘దోస్త్’ (DOST) అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక విడుత (Special Phase) కౌన్సిలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ విడుత ద్వారా ఇంతవరకు దోస్త్ అడ్మిషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. గతంలో సీటు వచ్చి, నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు కొత్తగా వేరే కళాశాలకు మారాలనుకుంటే ఈ విడుత ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నల్లగొండ దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.రాజారామ్ ఈ ప్రత్యేక విడతకు సంబంధించిన పూర్తి వివరాలను, కీలక తేదీలను వెల్లడించారు.
నూతన రిజిస్ట్రేషన్లు : జూలై 20 నుండి జూలై 26 వరకు
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ. 400/-
వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 20 నుండి జూలై 27 వరకు
సీట్ల కేటాయింపు : 30 జూలై, 2026
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 30 నుండి 01ఆగస్టు, 2026 వరకు
కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ల సమర్పణ : ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ టీసీ (TC) , ఇతర ధృవీకరణ పత్రాలను జూలై 31 నుండి 01ఆగస్టు, 2026 లోపు సంబంధిత కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.