యాదగిరి గుట్ట, యాదాద్రి : భక్తుల కొంగు బంగారం శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదగిరి గుట్ట(Yadagirigutta) కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజే స్వామి వారికి రూ : 50,64,604 ఆదాయం(income) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 5,55,150, కైంకర్యముల ద్వారా రూ. 5,902, సుప్రభాతం రూ. 23,100 , పుష్కరిణీ రూ. 1,600, వ్రతాలు రూ. 2,16,300,ప్రచార శాఖ ద్వారా రూ. 25,000 ఆదాయం వచ్చిందని తెలిపారు.
వీఐపీ(VIP) దర్శనం రూ. 4,50,000 ,యాదరుషి నిలయము రూ. 53,144, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 19,66,850, పాతగుట్ట రూ. 61,410,కళ్యాణ కట్ట ద్వారా రూ. 1,55,000,శాశ్వత పూజలు రూ. 42,500,వాహన పూజలు రూ. 20,300 ఆదాయం సమకూరిందన్నారు.
అదేవిధంగా కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 6,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,73,392, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 20,400,శివాలయం రూ. 14,100, అన్నదానం ద్వారా రూ. 2,23,726,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 3,82,200, ఇతర మార్గాల ద్వారా రూ. 24,530 ఆదాయం వచ్చిందని తెలిపారు.