హైదరాబాద్ : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిన్నటిదాక అరకొర ప్రయాణికులతో కనిపించిన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి.
రేపు 10 గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండటంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు హడావిడిగా ప్రయాణమయ్యారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే వారు విధిగా మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.