హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి 36 ఏండ్లకు పెంచాలని, 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. పోలీస్ నిరుద్యోగ జేఏసీతో కలి సి ఆయన మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. పోలీస్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడుతున్న అవస్థలను డీజీపీకి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5వేల పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని, అటువంటి ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహం తప్పదని వివరించారు. నిరుద్యోగుల అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అనంతరం పోలీస్ నిరుద్యోగ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. కేవలం 5 వేల పోస్టులతోనే నోటిఫికేషన్ ఇస్తే వారికి అన్యాయం చేసినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.