IT Rides | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల పలువురు నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నుంచి నగంలోని పలుచోట్ల దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఐటీ అధికారులు ఈ సారి ఎక్కువగా ఫార్మా కంపెనీలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నట్లు సమాచారం.
ఆర్సీపురంలోని నాగులపల్లి, అమీన్పూర్లోని పటేల్గూడలో సోదాలు చేస్తున్నారు. అలాగే గచ్చిబౌలిలోని హైహోం భుజాలో తనిఖీలు సాగుతున్నాయి. ఫార్మా కంపెనీ డైరెక్టర్లు, బ్యాంకు వివరాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు జరుగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.