హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నాగులపల్లి, పటేల్గూడతో పాటు గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. 15 ప్రాంతాల్లో ఇరవైకి పైగా బృందాలు సోదాలు చేశాయి.
సోమవారం ఓ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసులు, సిబ్బంది నివాసాల్లో సోదాలు చేశాయి. పన్ను ఎగవేయడంతోనే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది.