రంగారెడ్డి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న క్యామ మల్లేశ్ను మంగళవారం కేసీఆర్ వనస్థలిపురంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాద వ్, దండెం రాంరెడ్డి తదితరులు ఉన్నారు.