హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజల ఆయుష్షు పెరుగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడటమే ఇందుకు కారణమని రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యంలోని అర్థ గణాంకాలశాఖ తాజా స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని రంగాల వివరాలను ఈ నివేదికలో ప్రకటించారు. 2011లో జరిగిన జనగణను ప్రామాణికంగా తీసుకొని వయస్సులవారీగా జనాభా వివరాలను, రాబోయే కాలంలో ఉంటుదనుకొంటున్న జనాభా అంచనాలనూ తెలిపారు. 2011తో పోలిస్తే ఇప్పుడు 25 ఏండ్లు పైబడినవారు అధికంగా ఉన్నట్టు లెక్కగట్టారు. ప్రత్యేకించి 80 సంవత్సరాలకు పైబడినవారి సంఖ్య రెట్టింపైనట్టు అంచనా వేశారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు పెరగడం, వైద్యారోగ్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.