మహబూబ్ నగర్ : ఇక వెంటనే ఆర్టీపీసీఆర్ ఫలితాలు వస్తాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ మెషిన్ ను ఆయన ప్రారంభించారు. RT – PCR టెస్టింగ్, రిపోర్ట్ కోసం మాన్యువల్ పద్ధతిలో 6 గంటల సమయం పట్టేదన్నారు. కానీ ఈ కొత్త పరికరంతో రెండున్నర గంటల్లోనే రిపోర్ట్ వస్తుందన్నారు.
తద్వారా ప్రతి రోజు ఎక్కువ టెస్టులు చేసి వేగంగా రిపోర్ట్స్ అందించవచ్చన్నారు. తొందరగా వ్యాధి నిర్ధారణ చేయడంతో సంబంధిత వ్యక్తిని వెంటనే ఐసోలేట్ చేసి ఇతర కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారికి వ్యాపించడాన్ని నిరోధించవచ్చన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే రాష్ట్రంలో వైద్య రంగం ఎంతో మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు