సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 25: ఆయా జాతుల సంప్రదాయ వృత్తులను కాపాడం ద్వారా అంతరిస్తున్న జాతులను కాపాడవచ్చ ని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. మానవతా దృక్పథంతో కూడిన సాంకేతిక ఆవిష్కరణలకు ఐఐటీహెచ్ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ డిజైన్ కాన్సెప్ట్ ద్వారా సంప్రదా య పచ్చబొట్టుతో జీవనం కొనసాగిస్తున్న ‘తోటి’ మహిళలు, వారు ఆధారపడి జీవిస్తున్న గోండులపై పరిశోధన చేసినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ పరిధిలోని తోటి గూడలో ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ మార్గదర్శకత్వంలోని పరిశోధక బృందం పర్యటిం చిందని తెలిపారు. తోటి తెగవారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ఆధునిక సాం కేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి పాటలను రికార్డు చేసినట్టు వివరించారు. తోటి కమ్యూనిటీకి చెందిన మహిళలు సంప్రదాయ పచ్చబొట్టు తయారీదారులనీ, వైద్యం, రోగ నివారణలో భాగంగా సంప్రదాయ పచ్చబొట్టును ప్రదర్శిస్తున్నారని గుర్తుచేశారు. ఇలాం టి సంప్రదాయ పద్ధ్దతులు క్రమంగా తగ్గుతున్నాయని మూర్తి అన్నారు. 2021 జనాభా లెక్కల ప్రకారం 4,811 మంది తోటీలు మాత్రమే ఉన్నారని.. వారిని, వారి సంప్రదాయ వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.