Varsha Mitra | సంగారెడ్డి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వరద సమస్య నుంచి హైదరాబాద్ మహానగరాన్ని గట్టెక్కించేందుకు ఐఐటీ హైదరాబాద్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందుకుగాను అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సమాచార సేకరణ, క్రోడీకరణను ప్రారంభించింది. ఐఐటీహెచ్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ ైక్లెమేట్ చేంజ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీశ్కుమార్ రేగొండ ఆధ్వర్యంలోని పరిశోధన బృందం అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పనిచేయనున్నది.
భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన హెచ్చరిక వ్యవస్థను ఈ పరిశోధన బృందం అభివృద్ధి చేస్తున్నది. సతీశ్కుమార్తోపాటు పరిశోధక బృందం సభ్యులు మ హ్మద్ అజారుద్దీన్, పొనుకూటి పద్మిని ఇందు కు అవసరమైన ప్రోగ్రామ్ సిద్ధ్దం చేస్తున్నారు. వర్షమిత్ర పేరుతో ప్రచార మస్కట్ను గురువారం విడుదల చేశారు. హైదరాబాద్ వర్షం ఫొటోలు, డ్రైనేజీ వ్యవస్థల సమాచారాన్ని స్న్యాప్ ఫ్లడ్ అకౌంట్ లేదా స్న్యాప్ ఫ్లడ్ ట్విట్టర్(ఎక్స్)లో అప్లోడ్ చేయాలని కోరుతున్నా రు. యాప్ రూపంలో ఉండేలా అభివృద్ధి చేస్తున్నది. వచ్చే ఏడాది చివరన పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.