హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం దేశంలోనే అగ్రభాగానికి చేరింది. మౌలిక వసతుల కల్పనతో పట్టణాలు, పల్లెలు కొత్తరూపు సంతరించుకొని స్వచ్ఛతలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నా యి. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న విప్లవాత్మక సంస్కరణలు రాష్ట్ర ప్రగతిని కొత్త పుం తలు తొక్కిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విద్యాసంస్థలు మొదలు సింగరేణి వరకు ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహిస్తున్న తీరు ఇతర రాష్ర్టాలకు మార్గనిర్దేశనం చేస్తున్నది. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జొప్పించి అవినీతిరహిత పాలన అందిస్తున్న ది. అందుకే ప్రఖ్యాత ఆర్థిక నిపుణుల నుంచి ప్రముఖ మీడియా సంస్థల వరకు తెలంగాణపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో అవినీతి తక్కువగా ఉన్నదంటూ ప్రముఖ జాతీయ వాణిజ్య పత్రిక ‘మింట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లో సర్వే చేయగా, అతి తక్కువ అవినీతితో 14వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అవినీతి రాజ్యమేలుతూ టాప్లో నిలిచాయి.
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం అన్నదాతలకు అండగా నిలుస్తున్నదని ప్రతిష్ఠాత్మక ‘ఐఐఎం అహ్మదాబాద్’ ప్రశంసించింది. పరిశోధకులు అభిషేక్ షా, సావన్ రాఠి, అనింద్య ఎస్ చక్రవర్తి కలిసి రైతుబంధు పథకంపై అధ్యయనం చేశారు. 2018 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం రైతుబంధును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారు రైతుబంధు అమలుకు ముందు.. తర్వాత పరిస్థితులను పరిశోధన అంశంగా ఎంచుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2017 నవంబర్ నుంచి 2018 ఏప్రిల్ వరకు, 2018 మే నుంచి 2019 ఏప్రిల్ వరకు రైతుల కుటుంబాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఈ ఏడాది జనవరి 19వ తేదీన నివేదిక విడుదల చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నవారిలో 89 శాతం చిన్న, సన్నకారు రైతులేనని, వారికి ఎంతో మేలు కలుగుతున్నదని వివరించారు. రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల ఆర్థిక స్థోమత పెరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తుండటంతో అప్పుల బాధ తప్పటంతోపాటు రైతుల కొనుగోలు శక్తి పెరిగినట్టు గుర్తించారు. దీంతో వారి కుటుంబాల వినియోగ వ్యయం 12.9 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలకు చేరింది. 2018లోనే ఈ పథకం ద్వారా ప్రతిరైతు సగటున రూ.9,974 పెట్టుబడి సాయం పొందినట్టు ఐఐఎం అహ్మదాబాద్ వెల్లడించింది.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారమని, కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోరాడుతున్నాయని ఫ్రంట్లైన్ తాజా సంచికలో (ఏప్రిల్ 7, 2023 ఎడిషన్) వెల్లడించింది. ‘యా త్ర ఫీవర్ ఇన్ తెలంగాణ’ పేరుతో ప్రచురితమైన ఈ కథనం సీఎం కేసీఆర్కు ప్రజల్లో ఉన్న ఆదరణకు అద్దం పడుతున్నది. బీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆ పార్టీకి కొండంత అండగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ప్రజల్లో పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్నదని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, వీటిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించిందని పేర్కొన్నది. ఇదే సమయంలో రాష్ట్రం లో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టించుకోవటంలేదని తెలిపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నాయకులు చేస్తున్న ‘హాత్సే హాత్ జోడో’ యాత్ర, బీజేపీ నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న యాత్ర, ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో టీడీపీ చేస్తున్న యాత్రలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవటం లేదని కథనం స్పష్టం చేసింది. ఇదే క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల నుంచి బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న కమ్యూనిస్టు పార్టీల (సీపీఎం చేపట్టిన జనచైతన్యయాత్ర, బీజేపీ హఠావో.. దేశ్ కో బచావో పేరుతో సీపీఐ చేస్తున్న యాత్రలు) యాత్రలతో బీజేపీ అప్రజాస్వామిక విధానాలు ప్రజలకు వివరిస్తున్నాయని కథనంలో ఫ్రంట్లైన్ పేర్కొన్నది.
సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం రాష్ట్ర వ్యవసాయ రంగానికి జీవనరేఖగా మారిందని ప్రముఖ మ్యాగజీన్ ఫ్రంట్లైన్ కొనియాడింది. మార్చి 24 సంచికలో రైతుబంధుపై ప్రత్యేక కథనం ప్రచురించింది. రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత అన్నదాతలకు పెట్టుబడి గురించిన రంది పోయిందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారుల్లో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని తెలిపింది. వీళ్లంతా అప్పుల ఊబిలోకి వెళ్లి మానసికంగా, సామాజికంగా దెబ్బతినకుండా రైతు బంధు ఆదుకున్నదని చెప్పింది. రైతుల చేతుల్లో డబ్బులు ఉండటంతో వారు తమకు నచ్చిన పంట వేసుకునే సదుపాయం కలిగిందని పేర్కొన్నది. 2018లో 50.24 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే.. ఇటీవలి సీజన్లో (10వ విడత రైతుబంధు) ఏకంగా 65 లక్షలు దాటినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై అనేక పథకాలు, కార్యక్రమాల రూపంలో రూ.1,91,612 కోట్లను ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
గత ఏడాది శ్రీరామ నవమి, హనుమా న్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా, తెలంగాణలో మాత్రం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిన్టన్ నారిమన్ హర్షం వ్యక్తం చేశా రు. మతసామరస్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇటీవల ఆయ న ప్రశంసించారు. ‘సిటిజన్స్ అండ్ లాయ ర్స్ ఇనీషియేటివ్’ అనే సంస్థ ‘క్రోధ మా ర్గం: మత ప్రదర్శనల సాయుధీకరణ’ పేరుతో విడుదల చేసిన నివేదికకు ఆయన ముందుమాట రాశారు. ఇందులో ఆయన తెలంగాణ గురించి రాస్తూ.. ‘గత ఏడాది శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉ త్సవాల సందర్భంగా తెలంగాణలో హిం దూ ముస్లిం ప్రజానీకం మధ్య సౌభ్రాతృ త్వం మరోమారు వెల్లివిరిసింది. ప్రజల మధ్య శాంతి, సోదరభావం నిలిచి ఉం డేలా తెలంగాణ పోలీసు దళాలు, రాష్ట్ర హై కోర్టు గొప్ప కృషి చేశాయి’ అని కొనియాడారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లో తీవ్రస్థాయి హింసాకాండ చోటు చేసుకొన్నదని గుర్తు చేశారు. గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లోనే మైనారిటీ వర్గానికి చెందిన 100 మంది గాయపడ్డారని, ఇద్దరు మరణించారని చెప్పారు.